నోటాకు వచ్చిన ఓట్లే రాని బిజెపి దూకుడు: తొలుత చంద్రబాబు, తర్వాత జగన్

First Published Aug 24, 2020, 8:14 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ చాలా తెలివిగా రాష్ట్రంలో గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది. టీడీపీని తీవ్రంగా ఎటాక్ చేస్తుంది కానీ వైసీపీ మీద సాఫ్ట్ గా ఉంటుంది. ఇదేదో వైసీపీ మీద చూపెడుతున్న ప్రేమ అనుకునే కన్నా.... వారు చాలా తెలివిగా ఈ గేమ్ ఆడుతున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ చాలా చిన్న ప్లేయర్. నోటాకు వచ్చిన ఓట్లకన్నా తక్కువగానే వచ్చినప్పటికీ... ప్రస్తుత బీజేపీ వ్యవహారం చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లోఅధికారం మాదే అన్నట్టుగా దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం ఇప్పుడు వారికి కలిసొచ్చే అంశం. మోడీ చరిష్మా ఇంకో ప్లస్ పాయింట్.
undefined
రాష్ట్రంలో జెండా పాతాలని బలంగా డిసైడ్ అయిన బీజేపీ వైసీపీ, టీడీపీలలో టీడీపీని టార్గెట్ చేసి ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవాలని చూస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా విపరీతంగా టీడీపీని టార్గెట్ చేస్తుంది.
undefined
రామ్ మాధవ్ వంటి నాయకులే ఏకంగా వైసీపీ తమకు మిత్రుడు అని చెప్పారు. అది విమర్శించే మిత్రుడా, పొగిడే మిత్రుడా అనే విషయాన్నీ పక్కనబెడితే.... మిత్రులుగానే ఉంటామని చెప్పారు. రహస్య బంధం వారిమధ్య కొనసాగుతుందనేది బహిరంగంగానే వినిపించేమాట.
undefined
బీజేపీ టీడీపీని కార్నర్ చేయడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి, ప్రతి రాష్ట్రంలోనూ వారి పద్ధతి ఇదే అయినా... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు వారికి ఇక్కడ ఆ దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి. వారి ప్లాన్ ప్రకారం టీడీపీ ఓటర్ బేస్ ను చాలా త్వరగా తమ వైపు తిప్పుకోవచ్చు. కానీజగన్ ఓటర్ బేస్ అంత త్వరగా రాదు.
undefined
ఒక్కసారి ప్రధాన ప్రతిపక్షంగా గనుక నిరూపితం చేసుకోగలిగితే అప్పుడు హిందుత్వ కార్డును బలంగా ఉపయోగించుకొని వైసీపీని టార్గెట్ చేయాలనేది వారి ఆలోచన. ఇది జరగాలంటే... టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది.
undefined
టీడీపీని నిర్వీర్యం చేయడం ఇటు వైసీపీకి కూడా అవసరం. దానితో శత్రువు శత్రువు మిత్రుడన్న చందంగా వీరి స్నేహం ప్రస్తుతానికి కొనసాగుతుంది. భవిష్యత్ కార్యాచరణను పక్కకు పెడితే... ప్రస్తుతం మాత్రం ముందున్న ఉమ్మడి శత్రువు టీడీపీ.
undefined
ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ చాలా తెలివిగా రాష్ట్రంలో గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది. టీడీపీని తీవ్రంగా ఎటాక్ చేస్తుంది కానీ వైసీపీ మీద సాఫ్ట్ గా ఉంటుంది. ఇదేదో వైసీపీ మీద చూపెడుతున్న ప్రేమ అనుకునే కన్నా.... వారు చాలా తెలివిగా ఈ గేమ్ ఆడుతున్నారన్న విషయాన్నిమనం ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది.
undefined
వైసీపీని గనుక బీజేపీ వారు టార్గెట్ చేస్తే.... అప్పుడు యాంటీ వైసీపీ సెంటిమెంటును టీడీపీ ఉపయోగించుకునేఆస్కారం ఉంది. కాబట్టి వైసీపీ జోలికి వెళ్లకుండా ఉండడమే నయమని బీజేపీ భావిస్తుంది. కాబట్టి టీడీపీని వీలయినంత కార్నర్ చేసి వైసీపీ ని పేస్ టు పేస్ ఎదుర్కొవాలనేది బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది.
undefined
బీజేపీకి ఇక్కడ మరో ప్లస్ పాయింట్ కూడా కనబడుతుంది. బీజేపీని అటు టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ పెద్దగా విమర్శించలేవు. ఇరు పార్టీల మౌనాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ యోచన చేస్తుంది.
undefined
click me!