ఇదిలావుంటే, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి పవన్ కల్యాణ్ ఓ సూచన కూడా చేశారు. దాసరి సుధ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. దాసరి సుధ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, టీడీపీ తరఫున ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేయనున్నారు. ఓబుళాపురం రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటే దాదాపుగా దాసరి సుధ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు.