వైఎస్ జగన్ ముందస్తు ఆలోచన: టీడీపీలో కలవరం, చంద్రబాబు వ్యూహం?

First Published Oct 2, 2021, 9:16 AM IST

ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బాటలో ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

jagan, kcr

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతో టీడీపీ నాయకుల్లో కలవరం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (KCR) బాటలో ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్తే విజయం సులభమవుతుందని జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

chandrababu

ఎన్నికలకు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధం కాలేదని సమాచారం. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మాత్రం నియోజకవర్గాల స్థాయిలో ఉన్న నేతలపై అంచనా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కానీ, రాష్ట్రంలోని 175 స్థానాల్లో దాదాపు 40 స్థానాల్లో టీడీపీకి నియోజకవర్గం ఇంచార్జీలు లేరు. మరో 40 నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మార్చాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

jagan

ఇదిలావుంటే, జగన్ ఆలోచన టీడీపీ వర్గాలను మరింత కలవరానికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లను జగన్ నిరాకరించవచ్చునని అంటున్నారు. అదే జరిగితే వారు టీడీపీలో చేరడానికి ఉత్సుకత ప్రదర్శించవచ్చునని అంటున్నారు. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారికి టికెట్లు ఇస్తే ఎదురు దెబ్బ తగిలిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ టికెట్లు దక్కనివారు తమ పార్టీలోకి వస్తామంటే తీసుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. 

తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.

తాము టికెట్లు నిరాకరిస్తే వారు వైసీపీ తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగినా కూడా తమకే నష్టం వాటిల్లుతుందని టీడీపీ నాయకులు అంచనా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే మళ్లీ తాము అధికారానికి దూరం కావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ స్థితిలో చంద్రబాబు ఏ విధమైన వ్యూహాలు రచింంచి అమలుచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గత తప్పిదాలను పునరావృతం చేయకూడదని కూడా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

click me!