అచ్చెన్నతో చంద్రబాబు వ్యూహం: వైఎస్ జగన్ ఎత్తుగడ ఇదీ...

First Published Jun 13, 2020, 9:32 AM IST

అచ్చెన్నాయుడి ఒక్కడిపై దాడిని బీసీలపై దాడి అని టీడీపీ ప్రొజెక్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించక మానదు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ బీసీ నేతలు ఉన్నారు. అయినప్పటికీ.... వారెవ్వరిని కాదని బీసీలకు ప్రతీక అని చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ శ్రేణులందరు అనడం చూస్తుంటే మాత్రం ఎందుకిలా అంటున్నారని ఖచ్చితంగా అనిపించక మానదు. 

ఆంధ్రప్రదేశ్ లో నిన్న టీడీపీ సీనియర్ నేత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గ మారింది. ఈఎస్ఐ స్కాం లో భాగంగా ఆయనను అరెస్ట్ చేశామని ప్రభుత్వం చెబుతుంటే... మరొపక్కనేమో టీడీపీమాత్రం ఇది బీసీలపై దాడి అని పేర్కొంటూ, బీసీలనందరిని దీనిపై పోరాటం చేయమని పిలుపునిస్తుంది.
undefined
అచ్చెన్నాయుడి ఒక్కడిపై దాడిని బీసీలపై దాడి అని టీడీపీ ప్రొజెక్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించక మానదు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ బీసీ నేతలు ఉన్నారు. అయినప్పటికీ.... వారెవ్వరిని కాదని బీసీలకు ప్రతీక అని చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ శ్రేణులందరు అనడం చూస్తుంటే మాత్రం ఎందుకిలా అంటున్నారనిఖచ్చితంగా అనిపించక మానదు.
undefined
మహానాడులో చంద్రబాబు నాయుడు మాటలను గనుక నిశితంగా గమనిస్తే... ఇంతకుమునుపులా ఎలా ఓడిపోయామో, ఎందుకు ఓడిపోయామో తెలీదు అనే మాటలకు స్వస్తి చెప్పి... టీడీపీ ఓటమికి ప్రధాన కారణం బీసీలను దూరం చేసుకోవడమే అనే ఒక మాటను అన్నారు.
undefined
బీసీలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుండి నేటి ఇరు తెలుగు రాష్ట్రాల వరకు బలమైన ఓటు బ్యాంకు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి వెన్నుముకలా నిలిచింది వీరే. ఈ వోట్ బ్యాంకు అంతా ఇప్పుడు వైసీపీ వెంట నిలిచిందని టీడీపీ భావించింది.
undefined
తమ వైపుగా వచ్చిన బీసీలందరిని కన్సాలిడేట్ చేసుకోవడానికి జగన్.... కేసీఆర్ పంథాను ఫాలో అవుతున్నారు. తెలంగాణాలో బీసీల్లోని అన్ని ఉపకులాలకు కులాలవారీగా సహాయం చేసారు కేసీఆర్.గొల్ల కుర్మలకు గొర్రెలు, ముదిరాజ్, ఇతర చేపలు పెట్టె కులాలకు చేప పిల్లల ఉచిత పంపిణీ ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టి బీసీలందరిని తనవైపుగా ఆకర్షితులను చేసుకొని వారిని అక్కడే నిలిచిపోయేలా చేసారు.
undefined
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే పంథాలో కొనసాగుతూ... బీసీలందరికి చేయూతనందిస్తున్నారు. నాయీబ్రాహ్మణుల నుండి మొదలు రజకుల వరకు వారివారికిఅవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. తనవైపుకిగా ఆకర్షితులైన వారిని నిలిపి ఉంచుకోవాలని చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
undefined
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే పంథాలో కొనసాగుతూ... బీసీలందరికి చేయూతనందిస్తున్నారు. నాయీబ్రాహ్మణుల నుండి మొదలు రజకుల వరకు వారివారికిఅవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. తనవైపుకిగా ఆకర్షితులైన వారిని నిలిపి ఉంచుకోవాలని చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
undefined
మరోవైపు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న అచ్చెన్నాయుడుని సైతం టీడీపీ పొలిట్ బ్యూరోలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు.
undefined
కొన్ని రోజుల కింద సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరప్రచారం సాగింది. అచ్చెన్నాయుడును బీసీల లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఆయననుటీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా ఆయనను నియమించబోతున్నారు అని పోస్టులు వెలువడ్డాయి.ఇలా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడి అని టీడీపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చూస్తుంటే అది నిజమే అని అనిపించక మానదు. ఆ విషయం ముందుగానే పసిగట్టిన వైసీపీ... టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడిపై ఈ ప్లాన్ గీసినట్టుగా అర్థమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
undefined
అచ్చెన్నాయుడు పోతే.. మరో బీసీ లీడర్ లేరా అని అడగొచ్చు. కానీ ఇంత తక్కువకాలంలో ఒక మాస్ బీసీ లీడర్ ని తయారుచేయడం అంత తేలికైన పని కాదు. ఇతర బీసీ నాయకులున్నప్పటికీ... అచ్చెన్నాయుడు లెవెల్ పాపులారిటీ ఉన్న లీడర్ ఇప్పుడు ఎవరు లేరు. ప్రస్తుతానికి టీడీపీ బీసీ వ్యూహానికి గండి పడ్డట్టే అని వైసీపీ భావిస్తోంది.
undefined
ఈఎస్ఐ స్కాం జరిగిందనడానికి కొన్ని ప్రాథమిక సాక్ష్యాలయితే ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. తెలంగాణాలో ఆ స్కాం ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఆ స్కాం లో అరెస్ట్ అయిన అధికారుల్లో ఒకామె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్కాం కి సంబంధించిన ఆనవాళ్లే కనబడుతున్నాయి. ఇందులో అధికారులు మాత్రమే ఉన్నారా లేదా రాజకీయ నాయకులు కూడా ఉన్నారా అనేది తేలాల్సిన అంశం. ఇందులో ఎవరు ఎంత పెద్ద తలకాయలు ఉన్న సరే వారు శిక్షార్హులే... అది అచ్చెన్నాయుడు అయినా, వేరే ఎవరైనా!దీనిపై 14 రోజుల రేమండ్ తరువాత ఏసీబీ వారు ఏమేమి సాక్ష్యాధారాలు ప్రవేశ పెడతారో, కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాకపోతే ఈ మొత్తం వ్యవహారాన్నీ ఎవరు కూడా ఒక స్కాం లాగ చూడడం లేదు. అందరూ కూడా దీన్నొక రాజకీయ కోణం నుండి మాత్రమేచూస్తున్నారు.
undefined
click me!