ముంబై : కోడి రక్తాన్ని ఉపయోగించి 64 ఏళ్ల వ్యాపారవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫేక్ రేప్ ఆరోపణలు చేసిందో మహిళ. అలా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ అతని నుండి రూ. 3.26 కోట్లు దోపిడీ చేసింది. 2021 నాటి ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు గత వారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ముఠాలో మహిళ పేరు మోనికా భగవాన్ అలియాస్ దేవ్ చౌదరి, ఆమె సహచరులు అనిల్ చౌదరి అలియాస్ ఆకాష్, లుబ్నా వజీర్ అలియాస్ సప్నా, ఫ్యాషన్ డిజైనర్, మనీష్ సోడి అనే నగల వ్యాపారిలు ఉన్నారు.