ముంబైలోని షాహాపూర్ హైవేపై 30 ఏళ్ల మహిళ, మరో నలుగురు కలిసి మహిళ ప్రియుడిపై దాడి చేశారు. ఆ తరువాత అతడిని నగ్నంగా చేశారు. దీనికంటే ముందు అతని దగ్గరున్న నగదు, బంగారం దోచుకున్నారని పోలీసులు సోమవారం తెలిపారు. బాధితుడిని షాహాపూర్లో నివాసం ఉంటున్న బాలాజీ శివ్భగత్గా గుర్తించారు, అతను నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు.