ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద

First Published Jun 8, 2021, 3:17 PM IST

భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది తానొక్కడినే అని చెప్పుకొచ్చారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందంటూ నిత్యానంద వ్యాఖ్యానించారు. 

లైంగిక వేధింపులు, రాసలీలలతో వార్తల్లోకి ఎక్కిన నిత్యానంద.. ఆ తరువాత కేసుల్లో ఇరుక్కుని 2019లో దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ‘కైలాస’ అని ఓ ప్రత్యేక ద్వీప దేశాన్ని ఏర్పాటు చేసుకుని తన అనుచరులతో అక్కడే ఉంటున్నాడు.
undefined
ఈ స్వయంప్రకటిత దేవుడు ఇప్పుడు తాజాగా కరోనాకు తానే పరిష్కారం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ.. భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది తానొక్కడినే అని చెప్పుకొచ్చారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందంటూ నిత్యానంద వ్యాఖ్యానించారు.
undefined
తన కైలాసా ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిత్యానంద ఐరాస అధికారులను కోరినట్లు సమాచారం. కైలాస నుంచి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే నిత్యానంద తన కొత్త దేశంలో రిజర్వ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం, దానికి కరెన్సీ ముద్రించడం కూడా తెలిసిన విషయమే.
undefined
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి ఏ భక్తుడికీ తన కైలాస దేశానికి అనుమతి లేదని ఆయన తెలిపారు.
undefined
నిత్యానంద రిలీజ్ చేసే ఈ వీడియోలు సోషల్ మీడియా మీమ్ మేకర్స్ కు పండగలా మారతాయి. కరోనాతో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు ఇవి కాసేపు ఆటవిడుపుగా పనిచేస్తాయి.
undefined
నిత్యానంద రిలీజ్ చేసే ఈ వీడియోలు సోషల్ మీడియా మీమ్ మేకర్స్ కు పండగలా మారతాయి. కరోనాతో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు ఇవి కాసేపు ఆటవిడుపుగా పనిచేస్తాయి.
undefined
click me!