పోలీస్ ప్రేమకథ.. చిన్న గొడవ.. ప్రియురాలిని చంపి, తాను ఆత్మహత్య

First Published Feb 4, 2021, 12:58 PM IST

కానిస్టేబుల్ తన ప్రియురాలైన మహిళా కానిస్టేబుల్ ని కాల్చిచంపి.. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. 

ఇద్దరు పోలీసుల ప్రేమ కథ విషాదమైంది. వారిద్దరూ ఒకే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా..వారిద్దరి మధ్య ఓ విషయంలో పోలీస్ స్టేషన్ లోనే గొడవ జరిగింది.
undefined
ఆ గొడవ తారాస్థాయికి చేరడంతో.. కానిస్టేబుల్ తన ప్రియురాలైన మహిళా కానిస్టేబుల్ ని కాల్చిచంపి.. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్(26) స్థానిక పోలీస్ స్టేషన్ లోకానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ లో మేఘా చౌదరి(25) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది.
undefined
వారిద్దరూ 2018 బ్యాచ్ కి చెందిన వారు కాగా.. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
undefined
కాగా.. వారిద్దరి మధ్య ఇటీవల అభిప్రాయ బేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్టేషన్ లోనూ వారిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది.
undefined
ఈ క్రమంలో మనోజ్.. తన ప్రియురాలిని తుపాకీతో కాల్చి పారేశాడు. అనంతరం .. తనను తాను కూడా కాల్చుకున్నాడు.వీరిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మేఘా చౌదరి చికిత్స చేస్తుండగానే.. చనిపోయింది. కాగా.. మనోజ్ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నాడు.ఈ కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
undefined
click me!