తోటలోని పంటలను ఎత్తుకుపోవడం, టమాటా లోడ్లను తరలించడం, టమాటా రైతులను డబ్బుల కోసం హతమార్చడం కొత్తగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రైతుల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. గతంలో అరుదైన జపాన్ రకం మామిడికాయ ఒక్కోటి రూ.21వేలు ధర పలుకుతుండడంతో.. మధ్యప్రదేశ్లో ఆ రకం మామిడికాయలను సాగు చేసే ఓ రైతు తోటలకు కాపలాగా గార్డులను పెట్టుకున్నాడు. వారితోపాటు తొమ్మిది కుక్కలను కూడా కాపలాగా పెట్టాడు.