ఆలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా అమర్చిన అంచెల పలకలపై ఈ విగ్రహాలు అమర్చబడ్డాయి. ట్రస్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం, దిగువ పలకలపై ఒక్కో ఏనుగు ప్రతిమ, రెండో స్థాయిలో ఒక్కో సింహం విగ్రహం, పైభాగంలో హనుమంతుడి విగ్రహం ఒకవైపు ఉండగా, 'గరుడ' విగ్రహం మరోవైపు ఉంది.