‘ఈ కొత్త యూనిఫాంలు ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్నాయి. ఇవి ఎయిరిండియాగొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం" అని ఎయిర్లైన్ ఎక్స్లో చేసిన ఓ పోస్ట్లో పేర్కొంది. ఎయిర్లైన్ 10,000 మందికి పైగా విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, భద్రతా సిబ్బందికి ఎరుపు, వంకాయ, బంగారు రంగులలో కొత్త యూనిఫామ్లను రూపొందించడానికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకుంది. ఇది "విశ్వాసం, శక్తివంతమైన కొత్త భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది" అని పేర్కొంది.