పార్లమెంట్ వద్ద మూడంచెల భద్రతా ఉంటుంది. పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీ పాసులు జారీ చేయడానికి ముందు, కొత్త పార్లమెంట్ గేటు వద్ద, పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద, విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. పార్లమెంట్ లోకి పెన్నులు, పుస్తకాలతో పాటు ఏ వస్తువులను కూడ తీసుకోనేందుకు అనుమతించరు. ఎంపీల సిఫారసు లేఖలపై వచ్చే విజిటర్స్ వెంట పీఎస్ఎస్ సిబ్బంది ఉంటారు.అనుక్షణం విజిటర్స్ ను ఓ కంట గమనిస్తుంటారు.