అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు?
ఏడిఆర్ విడుదలచేసిన సీఎంల ఆస్తిపాస్తుల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిస్థానంలో వున్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఏకంగా 931 కోట్ల రూపాయలు వున్నాయట. ఇంత భారీగా ఆస్తులు కలిగివున్న ఆయన భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేర్కొంది ఏడింది.
చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తిపాస్తులు రూ.332 కోట్లు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే అత్యధిక అప్పులు కలిగివున్నది కూడా ఈయనే. ఇతడికి రూ.180 కోట్ల వరకు అప్పు వుందట.
ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వున్నారు. ఆయన ఆస్తులు రూ.51 కోట్లు... అప్పులు 23 కోట్లు వున్నాయట. ఇక జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేవలం రూ.55 లక్షల ఆస్తులతో చివరినుండి రెండోస్థానం, కేరళ సీఎం పినరయి విజయన్ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరినుండి మూడోస్థానంలో వున్నారు.
మొత్తంగా చూసుకుంటే దేశంలోని అందరు ముఖ్యమంత్రుల సగటు ఆస్తి విలువ 1,630 కోట్ల రూపాయలు. కేవలం మమతా బెనర్జీ, ఒమర్ అబ్దుల్లా మినహా మిగతా ముఖ్యమంత్రులందరూ కోటీశ్వరులే. ఈ ఇద్దరు మాత్రమే లక్షాధికారులైన ముఖ్యమంత్రులు.