మధుమితకు దీపక్ సేథి పరిచయం. అలా మధుమిత దీపక్ సేథిని ఉషకు పరిచయం చేసిందని పోలీసులు తెలిపారు. మార్చి 30న మధుమిత, ఉషాలు కన్నాట్ ప్లేస్లోని మెట్రో స్టేషన్ సమీపంలో దీపక్ సేథీని కలిశారు. అనంతరం ఉషాను అతను బల్జీత్ లాడ్జికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
విచారణ సమయంలో, ఉష, సేథీని చంపే ఉద్దేశ్యం తనకు లేదని పోలీసులకు చెప్పింది. అనుకోకుండా జరిగిపోయిందని.. అందుకే గది నుండి వెళ్లేముందు దీపక్ సేథీ కోసం "సారీ" నోట్ను వదిలివేసినట్లు కూడా చెప్పింది. అతను "మంచి వ్యక్తి" అని పేర్కొంది. ఉష దగ్గరి నుంచి హోటల్ నుంచి తీసుకెళ్లిన బ్యాగ్, సేథి బంగారు ఉంగరం, అతని మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.