ఐపీఎస్ అధికారి నవజోత్, బాంబే పోలీసులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ.10 కోట్లు దోచేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని వారు బెదిరించారని బాధిత వృద్ధుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. దీంతో TGCSB అధికారులు ఎఫ్ఐఆర్లో నవజోత్, బాంబే పోలీసులను నిందితులుగా పేర్కొన్నారు. దీని గురించి STOIని వివరణ కోరగా, అసలు నిందితులను ఇంకా కనుక్కోలేదని, ఫిర్యాదుదారు నుండి ప్రాథమిక సమాచారం ఆధారంగా మోసానికి వినియోగించిన వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని తెలిపారు. దీని అర్థం వారే నిందితులు కాదని, అసలు నేరస్థులను పట్టుకున్న తర్వాత పేర్లు సవరిస్తామని చెప్పారు.