అతని పేరు దాడి శ్రీనివాసరావు (49). సైబర్ నేరాల్లో ఆరితేరిన ఇతను రోజుకు దాదాపు రూ. 5కోట్లకు పైగా మోసాలు చేస్తుంటాడు. ఈ సైబర్ నేరగాడిని బాంగుర్ నగర్ పోలీసులు హైదరాబాదులోని ఓ హోటల్ నుంచి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ నేరాలకు పాల్పడే ముఠాలోని మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు కోల్ కతావాసులు కాగా, మరో ఇద్దరూ ఠాణెకు చెందినవారు.