మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేశాయని ప్రచారం సాగింది. ఇందులో భాగంగానే ఓటర్లకు తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేశాయనే ప్రచారం సాగింది. విచ్చలవిడిగా డబ్బులు , బంగారం పంపిణీ చేశారని ప్రచారంమ సాగింది. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.6.80 కోట్ల లెక్క చూపని నగదును పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు తమ శక్తియుక్తులను ధారపోశాయి.