దారుణం : నడివీధిలో ఫోన్ కోసం.. యువతి మీద మహిళ దాడి.. !

First Published Jun 16, 2021, 2:49 PM IST

ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. పట్టపగలు దారుణం జరిగింది. వీధిలో నడిచి వెడుతున్న యువతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని, దారుణంగా కొట్టింది ఓ మహిళ. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది. 

ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. పట్టపగలు దారుణం జరిగింది. వీధిలో నడిచి వెడుతున్న యువతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని, దారుణంగా కొట్టింది ఓ మహిళ. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది.ఈ ఫుటేజి సాయంతో ఢిల్లీ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. దాదాపు 20 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో ఓ మహిళ ఫోన్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో వెనకనుంచి వచ్చిన మరో మహిళ ఆమె చేతిలోని ఫోన్ లాక్కుంది.
undefined
మొదలు షాక్ అయిన ఆమె ఆ తరువాత ఫోన్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకోవడంతో.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఫోన్ ఎంతకూ ఒదలకపోవడంతో నిందితురాలు బాధితురాలిని రాయి తీసుకుని కొట్టి ఫోన్ లాక్కుంది.అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఫోన్ లాక్కున్న తరువాత పారిపోకుండా నింపాదిగా వెనక్కి తిరిగి నడిచివెళ్లడం. నిందితురాలి పేరు జ్యోతి అని తెలిసింది.
undefined
బాధితురాలిని కొట్టి, దూరంగా నెట్టేసి జ్యోతి వెళ్లిపోవడం.. రెండు సెకన్లలో తేరుకున్న బాధితురాలు జ్యోతి వెనక వెళ్లడం కనిపిస్తుంది. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగింది. నిందితురాలు జ్యోతి మంగోల్‌పురి నివాసి అని పోలీసులు తెలిపారు.
undefined
ఈ నెల ప్రారంభంలో, 19యేళ్ల ఓ యువకుడు తన తండ్రి పుట్టినరోజు కోసం కేక్ కొనడానికి బైటికి వస్తే.. నలుగురు వ్యక్తులు పొడిచి చంపిన సంగతి తెలిసిందే. వారినుంచి తప్పించుకోవడానికి అతను పెనుగులాడడం.. నలుగురు నిందితులు కునాల్‌ను పలుసార్లు పొడిచి చంపడం సిసిటివి ఫుటేజీలో కనిపించింది. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది.
undefined
అంతకుముందు ఫిబ్రవరిలో, నార్త్-వెస్ట్ ఢిల్లీలో దోపిడీ దొంగలనుంచి బిడ్డను రక్షించే క్రమంలో 25 ఏళ్ల యువతి కత్తిపోట్లకు గురై మరణించింది. ఈ సంఘటనను రాజధాని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సిసిటివి కెమెరాలో నమోదయ్యింది.
undefined
click me!