ఒకప్పుడు మన పెద్దలు అన్నంలో కూరలను ఎక్కువగా కలుపుకుని తినేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉంటూ వందేళ్లు బతికారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్నంలో కూరలను ఎక్కువగా తినాలని సూచిస్తోంది. 400 గ్రాముల కూరగాయలు మీ రోజు వారి ఆహారంలో ఉండేట్టు చూసుకోలని సూచిస్తోంది. అలాగే రకరకాల పండ్లను సైతం తీసుకుంటూ ఉండాలి. కూరగాయల్లో ఆకు కూరలు, దుంపలు, ఇతర కాయగూరలు ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. దీనిప్రకారం.. మీరు రోజుకు అరకిలో కూరలు తింటే మిగతాది పండ్లు, పాల ఉత్పత్తులు, అన్నం వంటి వాటిని తీసుకోవాలి.