పనితప్ప వేరే ధ్యాసే లేదా..? ప్రాణానికే ప్రమాదం..!

First Published May 29, 2021, 10:32 AM IST

పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి ఎప్పుడైతే మన దేశంలోకి ఎంటరైందో.. అప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆఫీసుల మొహం చూసి దాదాపు సంవత్సరం దాటిపోయింది. దాదాపు అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అయితే.. ఇంటి నుంచి పని చేయడమే కదా.. ఆఫీసుకు వెళ్లే పనికూడా లేదు..హాయిగా ఉంటుంది.. అని అందరూ మొదట అనుకున్నారు. ఒక నెల రోజులు బాగానే ఉంది. అందరూ ఉత్సాహంగానే పనులు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి.. ఇబ్బందిగా మారడం మొదలైంది.
undefined
కరోనా కారణంగా దేశ ఎకానమీ కూడా తలకిందులు అయ్యింది. ఇక ఉద్యోగస్తులకు సైతం పని ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇంట్లోనే కదా ఉండేది అని.. చేయాల్సిన పని గంటల కన్నా ఎక్కువ పని చేయించడం మొదలుపెట్టాయి కొన్ని సంస్థలు. దీంతో.. పలువురు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు తేలింది.
undefined
పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఆఫీసు పనులతోనే గడుపుతున్నవారి ప్రాణానికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం కాదు.. ఇప్పటి వరకు చాలా మంది ఏకంగా ప్రాణాలు కోల్పోయారని ఓ పరిశోధనలో తేలింది.
undefined
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం ప్రకారం, అధిక పని ఒత్తిడి, ఎక్కువ పని గంటలు కారణంగా 194 దేశాలలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారట. ఈ కారణంగానే వివిధ దేశాల్లో 29శాతం మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
undefined
వారానికి 40గంటలు, అంతకన్నా ఎక్కువ పనిచేసేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని.. వారిలో ఏదో ఒక అనారోగ్యం కలుగుతోందని పరిశోధనలో తేలింది.
undefined
కొన్నిసార్లు కంపెనీలు.. ఉద్యోగులను ఎక్కువ సాధించడానికి ఎక్కువ కృషి చేయాలని డిమాండ్ చేస్తాయి, ఇది సహజం. కానీ ఎక్కువ పని గంటలు కష్టపడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ప్రారంభమౌతాయట .
undefined
వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు 35% పెరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కార్యాలయానికి సంబంధించిన సమస్యలు, పని ఒత్తిడి కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా అనేక అకాల మరణాలు కూడా సంభవించాయి.
undefined
అధిక పని అంటే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల గుండెను నేరుగా ప్రభావితం చేస్తాయట. దాని వల్ల గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుందట. అంతేకాకుండా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు తిండి కూడా సరిగా తినరు.తక్కువ నిద్రపోతారు.
undefined
ఇక ఆరోగ్యంపై దృష్టి అసలు ఉండదు. వ్యాయామం జోలికి కూడా పోరు. ఇక వీటికి తోడు మద్యం వంటి అలవాట్లకు బానిసలుగా మారిపోతారు. దీని వల్ల లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు చెబుతున్నారు.
undefined
వీటికారణంగా అప్పటి వరకు మన కళ్లను మంచిగా కనిపించిన వ్యక్తే.. మరుసటి రోజు అకాలమరణం చెందుతున్నారు. కాబట్టి.. ఈ విషయంలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
click me!