భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు.. సూర్యరశ్మి భూమిని చేరదు. దీనినే సూర్య గ్రహణం అంటారు. నమ్మకాల ప్రకారం.. గ్రహణం ఏర్పడటాన్ని శుభప్రదంగా భావించరు. ఈ ఏడాది ఏర్పడే రెండో సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. ఈ గ్రహణం ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడా, అర్జెంటీనా తదితర దేశాల్లో కనిపిస్తుంది.