ఇందుకోసం ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీనిలో ఒక కప్పు తేనెను కలపండి. ఈ వాటర్ లో మీ పాదాలు 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లలోంచి పాదాలను బయటకు తీసి ప్యూమిస్ స్టోన్ తో పాదాలను రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో పాదాలను కడగండి.
మాయిశ్చరైజ్ అప్లై చేయాలి
పాదాలను శుభ్రం చేసిన తర్వాత మెత్తని టవల్ తో బాగా తుడవండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ను మడమలకు, పాదాలకు పెట్టండి. ఈ మాయిశ్చరైజర్ పగిలిన మడమలను తగ్గిస్తుంది. పాదాలను అందంగా మారుస్తుంది. చలికాలంలో పగిలిన మడమలను తగ్గించుకోవడానికి, చర్మం మృదువుగా మారడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనెను అప్లై చేయండి.