ఆడవాళ్లు, మగవారికి మడమలు పగళడం చాలా కామన్. కానీ దీనివల్ల మడమలు విపరీతంగా నొప్పి పెడతాయి. అంతేకాకుండా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే అందులో నుంచి రక్తం కూడా వస్తుంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మడమల పగుళ్లు చాలా మందికి ఉండే ఒక కామన్ ప్రాబ్లం. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మడమలను సరిగ్గా క్లీన్ చేయకపోవడం, ఎక్కువ సేపు నిలబడటం, సరిపోని షూస్ ను వేసుకోవడంం, ఊబకాయం, డ్రై స్కిన్, పరిశుభ్రత లేకపోవడం, సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల మడమలు పగుళుతుంటాయి.
ఇది చిన్న సమస్యే అయినా దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పాదాలపై కాస్త శ్రద్ధ పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్ని చిట్కాలను పాటిస్తే పగుళ్లు తగ్గిపోయి చాలా స్మూత్ గా మీ పాదాలు అవుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
మడమల పగుళ్లను తగ్గించే చిట్కాలు
1. పాదాలను కాసేపు నీటిలో నానబెట్టాలి
మడమల పగుళ్లు తగ్గాలంటే ముందుగా మీ పాదాలను నీట్ గా కడిగి 15 నుంచి 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల మీ పాదాల చర్మం మృదువుగా అవుతుంది. దీనివల్ల ఎక్స్ఫోలియేట్ చేయడం ఈజీ అవుతుంది. అయితే ఈ గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఎప్సమ్ ఉప్పును కూడా వేయండి. దీనివల్ల డ్రై స్కిన్ నుంచి మీ పాదాలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఎప్సమ్ ఉప్పు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.
36
2) ఎక్స్ఫోలియేట్
కొద్దిసేపు పాదాలను నీళ్లలో నానబెట్టడం వల్ల మీ పాదాల చర్మం స్మూత్ గా అవుతుంది. దీంతో ఏ రకమైన చర్మాన్నైనా ఎక్స్ఫోలియేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ లేదా స్క్రబ్ తో రుద్దండి. దీంతో పాదాలకు ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. తర్వాత హోం మేడ్ స్క్రబ్ ను యూజ్ చేయండి. కొబ్బరినూనె, పంచదార, తేనె, నిమ్మరసాన్ని మిక్స్ చేసి పగిలిన మడమలపై అప్లై చేయండి. దీన్ని బాగా స్క్రబ్ చేసి శుభ్రమైన నీళ్లతో కడిగేయండి.
46
3) మాయిశ్చరైజ్ చేయండి
పాదాలను స్క్రబ్ చేసిన తర్వాత మర్చిపోకుండా మాయిశ్చరైజ్ చేయాలి. ఇందుకోసం మీరు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ను ఉపయోగించొచ్చు. లేదా పెట్రోలియం జెల్లీని కూడా మడమలపై రాయొచ్చు. దీనివల్ల తేమ ఎక్కువ సేపు ఉంటుంది.
56
మడమల పగుళ్లను తగ్గించే ఇంటి చిట్కాలు
1. స్కిన్ హైడ్రేట్ గా ఉంటే పాదాలు పగలవు. ఇందుకోసం మీకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అరటిపండు పాదాలను తేమగా ఉంచే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తని పేస్ట్ చేసి పాదాలకు, గోర్లకు బాగా అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది.
66
పగిలిన మడమలు
2) నిమ్మకాయతో కూడా పాదాల మడమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిమ్మకాయ, వాసెలిన్ ను కలపాలి. ఈ నిమ్మకాయలోని ఆమ్ల లక్షణాలు, వాసెలిన్ లోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగి డ్రై స్కిన్ తగ్గిస్తాయి.
అలాగే పగిళిన మడమలు శుభ్రం అవుతాయి. ఇందుకోసం ఒక టీ స్పూన్ వాసెలిన్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని పాదాలు, మడమలతో పాటుగా ఇతర భాగాలకు బాగా పట్టించండి.
తర్వాత సాక్సులు వేసుకుని 6 నుంచి 7 గంటల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. దీన్ని రాత్రిపూట ప్రయత్నించండి.