కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక ఈ పెళ్లి తంతు ముగియగానే యథావిథిగా జరిగే కార్యం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కదా. శోభనం రాత్రి పడకగదిని, మంచాన్ని గులాబీ పువ్వులు, మల్లెపువ్వులతో అందంగా అలంకరిస్తుంటారు. అలాగే స్వీట్లు, రకరకాల పండ్లతో ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.