మనం రోజూ స్నానం చేస్తాం. అయితే.. స్నానం చేసిన ఒక గంటకే.. ఆ ఫ్రెష్ నెస్ తగ్గిపోతుంది. చెమట వాసన కూడా రావడం మొదలౌతుంది. ఆ వాసనను కంట్రోల్ చేయడానికి పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ వాడతాం. అవి కూడా మరో గంటను ఫ్రెష్ గా ఉంచగలవు. అంతే.. కానీ.. మనం స్నానం చేసే సమయంలో చిన్న కర్పూరం ముక్కను ఆ స్నానం నీటిలో వేసి కలిపి చేయడం వల్ల... రోజంతా ఫ్రెష్ గా ఉండటంతో పాటు.. మన అందాన్ని కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా?
కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. నీటిలో వేసి స్నానం చేస్తే దురద, దద్దుర్లు, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సహజ సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.