కీళ్ల నొప్పి
కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం ముందుగా బొడ్డులో కొన్ని చుక్కల నెయ్యి వేసి నాభి చుట్టూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తొలగిపోతాయి. వాపు కూడా చాలా వరకు తగ్గుతుంది.
వాత దోషం సమతుల్యంగా ఉంటుంది
ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డుకు నెయ్యిని పూయడం వల్ల వాత దోషం తగ్గిపోతుంది. వాతం అసమతుల్యత ఉన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థలో ఆందోళన, చంచలత, రుగ్మతలు వస్తాయి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి నెయ్యి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు స్థిరంగా ఉంటుంది.