ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 255 పోస్టులను నియమించనుంది. ఇందుకు దరఖాస్తు చివరి తేదీ 7 నవంబర్ 2021గా నిర్ణయించారు. తుది గడువు తర్వాత అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయలేరు. కాబట్టి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా వీలైనంత త్వరగా ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థుల ఎంపిక కోసం రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, ఓబిసి, ఈడబల్యూఎస్ అభ్యర్థులకు రూ. 1500 కాగా, ఎస్సి కేటగిరీ, ఎస్టి కేటగిరీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుమును సమర్పించవచ్చు.