Teacher Job : మీరు గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటున్నారా? అయితే కేవలం ఏడాది కష్టపడితే చాలు

Published : Feb 10, 2025, 11:17 PM ISTUpdated : Feb 10, 2025, 11:44 PM IST

Career Guidance : మీరు టీచింగ్ ఫీల్డ్ ను ఎంచుకోవాలని అనుకుంటున్నారా? బి.ఈడి చేయాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. మీరే కేవలం ఏడాది కష్టపడితే చాలు...ఇక టీచర్ కావచ్చు... 

PREV
13
Teacher Job : మీరు గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటున్నారా? అయితే కేవలం ఏడాది కష్టపడితే చాలు
One Year B.Ed Course

Career : మీకు టీచింగ్ అంటే ఇష్టమా? ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాలన్నది మీ కోరికా? అయితే మీకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతోంది. టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే బిఈడి (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఇది రెండేళ్ల కోర్సు. అయితే 2026-27 విద్యాసంవత్సరం నుండి దీన్ని ఒకే ఏడాది కోర్సుగా మార్చనున్నారు.  ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. 

బిఈడి ఏడాది కోర్సుకు సంబంధించి ఎన్‌సీటీఈ ఇప్పటికే డ్రాప్ట్ రెగ్యులేషన్స్-2025 కు ఆమోదం లభించింది. అయితే దీనిని వెంటనే అమలు చేయకుండా ప్రజాభిప్రాయం కోసం ఏడాది సమయం తీసుకుంటున్నారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకోనున్నారు... ఇందుకు తగ్గట్లుగా కోర్సును రూపొందిస్తారు. కాబట్టి 2026-27 విద్యాసంవత్సరం నుండి ఈ ఏడాది బిఈడి కోర్సు అమలులోకి వస్తుంది. 

23
school teacher

ఏడాది బిఈడి కోర్సుకు అర్హతలు : 

సాధారణంగా ఏదయినా డిగ్రీ పూర్తిచేసినవారు ఇప్పుడున్న రెండేళ్ల బిఈడి కోర్సు చేయడానికి అర్హులు. కానీ రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న ఏడాది బిఈడి కోర్సుకు మాత్రం మూడేళ్ల డిగ్రీ సరిపోదు. వీరు ఇప్పటిలాగే రెండేళ్లపాటు బిఈడి చేయాల్సి వుంటుంది. కానీ నాలుగేళ్ల డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు మాత్రం వన్ ఇయర్ బిఈడి కోర్సు చేయవచ్చు. 

ఇలా రెండేళ్ల బిఈడి కోర్సును కొనసాగిస్తూనే కొత్తగా ఏడాది కోర్సును తీసుకువస్తున్నట్లు NCET ఛైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు.  ఎమ్ఈడి లో కూడా ఏడాది కోర్సు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు... అయితే రెండేళ్ల కోర్సు కూడా అలాగే కొనసాగుతుందని పంకజ్ అరోరా వెల్లడించారు.  

33
Government Teacher

పదేళ్ల తర్వాత మళ్లీ ఏడాది బిఈడి కోర్సు :

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరింత శిక్షణ అవసరమని భావించిది. దీంతో టీచర్ అర్హతా  విద్యాభ్యాసం బిఈడి కోర్సును ఏడాది నుండి రెండేళ్లకు పెంచింది.   

ఇలా గత పదేళ్లుగా బిఈడి రెండేళ్ల కోర్సు మాత్రమే అందుబాటులో వుంది. అయితే ప్రస్తుతం అభ్యర్థుల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు మళ్ళీ ఏడాది బిఈడి కోర్సును అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ వన్ ఇయర్ బిఈడి కోర్స్ రూపకల్పన కోసం ఎనిమిది సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటుచేసారు. దీని సిపార్సుల మేరకే ఈ కోర్సును తిరిగి అందుబాటులోకి తీసుకువస్తోంది ఎన్సిటీఈ.

click me!

Recommended Stories