నాగ్లేరియా ఫౌలెరీ ఉన్న నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు, అమీబా ముక్కు ద్వారా మెదడుకు వలస వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కలుషిత నీరు ముక్కు పై భాగానికి వెళ్లకపోతే రోగాల బారిన పడరని గమనించాలి. నేగ్లేరియా-ఉన్న నీరు పీల్చిన ఒకటి నుండి 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.సీడీసీ ప్రకారం, లక్షణాలు కనిపించిన తర్వాత ఒకటి నుండి 18 రోజుల వరకు వ్యక్తులు మరణిస్తారు. తీవ్రమైన ఫ్రంటల్ తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ గట్టిపడటం, మూర్ఛలు, భ్రాంతులు, కోమా అమీబా వల్ల కలిగే కొన్ని లక్షణాలు.