ఐరాస హెడ్ క్వార్టర్స్లో మోడీ యోగా సాధన.. తాను చేస్తూ, నలుగురితో చేయిస్తూ (ఫోటోలు)
Siva Kodati |
Published : Jun 21, 2023, 08:59 PM IST
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి జనం కదిలివచ్చారు. ఈ భారీ ఈవెంట్ గిన్నిస్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
25
modi
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశాలకు చెందిన వారితో కలిసి మోడీ యోగాసనాలు వేశారు. అంతేకాదు వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.
35
modi
యోగాకు ఎలాంటి పేటెంట్, రాయల్టీ లేవన్నారు. యోగా డే జరపాలనే భారత్ ప్రతిపాదనకు అన్ని దేశాలు అండగా నిలిచాయని మోడీ గుర్తుచేశారు.
45
modi
భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యోగా ప్రాచుర్యంలో వుందని.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందన్నారు. యోగా అంటే అందరినీ కలిపేదని నరేంద్ర మోడీ అన్నారు.
55
modi
ఈ ఏడాదిని మిల్లెట్ ఇయర్గా భారతదేశం ప్రతిపాదించిందని.. దీనిని ప్రపంచం ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అనంతరం ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది.