అది కాకుండా ఆరోజు అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని అక్కడి ముస్లింలు వాదించారు ఇది పవిత్ర మాసంలో పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందుకే పాకిస్తాన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 14న జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం బ్రిటిష్.. భారత చివరి వైస్రాయ్ భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని మహమ్మదాలీ జిన్నాకి ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు.