police have registered a case against 11 celebrities for promoting Betting apps in telugu
అప్పటి నుంచి మొదలైన యాక్షన్:
ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు ప్రారంభం కావడం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపిన సజ్జనార్ ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేశారు. దీంతో ఇదంతా అన్వేష్ కృషి ఫలితమేనని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సైతం పలువురు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతున్నారు. గతంలో తమకు తెలియకుండా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశామని, వాటిని ఎవ్వరూ నమ్మొద్దని వీడియోలు పెడుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రూ. 10 లక్షల జరిమానా తప్పదు:
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. వినియోగదారుల ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం సెలబ్రిటీలు మోసపూరితమైన యాప్లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల పాటు నిషేధం విధిస్తారు. అంతేకాకుండా రూ.10లక్షల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలుశిక్ష తప్పదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.