వందల ఏళ్ల క్రితం భారతదేశానికి చెందిన కొందరు ధనవంతులు ఫ్రాన్స్, లండన్ లాంటి దేశాల నుంచి ఇలాంటి ఫ్రిడ్జ్లను దిగుమతి చేసుకునే వారని తెలుస్తోంది. అయితే అప్పట్లోనే వీటి ధర వేలల్లో పలికేవి అంటే. కేవలం కొంతమంది ఇల్లలోనే ఇవి ఉండేవి. కరెంట్ లేని రోజుల్లో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయంటే వినడానికి వింతగానే ఉంది కదూ.
హైదరాబాద్లో ఉపయోగించేవారు:
నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. హైదరాబాద్ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలో వీటిని ఉపయోగించేవారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకునే వారు. కిరోసిన్ రిఫ్రిజిరేటర్ను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ కారే 1858లో కనుగొన్నాడు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను ఈ లింక్ క్లిక్ చేసి మీరూ చూసేయండి.