వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తమ చర్మం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, షుగర్ పేషెంట్స్ అయితే, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ది.వర్షకాంలో వాతావరణం తేమగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో రక్త ప్రసరణ, నరాల దెబ్బతినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా గాయాలపాలవుతారు.వర్షాకాలంలో తేమ గాయం మానడాన్ని మరింత ఆలస్యం చేస్తుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చర్మాన్ని పొడిగా , శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం చాలా ముఖ్యం.