భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇదొక సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఈ వ్యాధి బారిన పడితే మందులను ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే జీవితాంతం దీన్ని అదుపులో ఉంచడాలి. డయాబెటీస్ అంటే మీ క్లోమం తగినంత ఇన్సులిన్ ను తయారుచేయలేని పరిస్థితి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటీస్ పేషెంట్లు మంచి జీవనశైలిని పాటించాలి. అలాగే కేలరీలను ఎక్కువగా తీసుకోకూడదు. కేలరీలను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమలో తక్కువగా పాల్గొనడం, చెడు ఆహారాలను తినడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.