ఈ రోజుల్లో చాలా మంది అన్నం తక్కువగా తింటూ చపాతీ, జొన్న రొట్టెలను ఎక్కువగా తింటున్నారు. జొన్న రొట్టె కంటే గోధుమ చపాతీనే చాలా మంది రోజుకు ఒకటి రెండు పూటలా తింటున్నారు. ఎందుకంటే ఇవి బరువును తగ్గిస్తాయని, బరువు పెరగకుండా చేస్తాయని, పోషకాలు పుష్కలంగా అందుతాయని, శరీరం హెల్తీగా ఉంటుందని వీటిని తినడం అలవాటు చేసుకున్నారు.
కానీ గోధుమ రొట్టె కంటే బియ్యం పిండితో చేసిన రొట్టెనే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రొట్టె చాలా సులభంగా జీర్ణమవుతుంది.
అలాగే ఈ పిండితో చేసిన రొట్టె టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోటీని ఆకుపచ్చ కూరల్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో రైస్ పిండితో చేసిన రొట్టె తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.