ఈ పప్పుధాన్యాలలో మినపప్పు, ఉలవలు, శెనగపప్పు, ఎర్రపప్పు, కందిపప్పును తినకూడదు. ఈ పప్పులను మాత్రమే కాదు కిడ్నీ బీన్స్, చిక్పీస్, వైట్ బఠానీలను కూడా రాత్రిపూట తినకూడదు. నిజానికి ఈ పప్పు దినుసులన్నీ అంత సులువుగా జీర్ణం కావు. వీటిని రాత్రిపూట తింటే ఎసిడిటీ, కడుపులో గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం, పొట్ట బరువుగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటివల్ల మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర ఉండదు. ఇది మరుసటి రోజుపై ప్రభావం చూపుతుంది.