బరువు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అధిక బరువు వల్ల చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకుంటూ సహజంగా బరువు తగ్గే ప్రయత్నం చేయడం ఉత్తమం. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనాస పండు
పైనాపిల్ ను అందరూ ఇష్టంగా తింటారు. పండుగా కంటే కూడా జ్యూస్ గా తాగుతుంటారు. పైనాపిల్ బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. ఇది. 86% నీటిని కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.