రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలకు స్పష్టంగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది:
* “RBI పాత నాణేలు లేదా పాత నోట్లను కొనుగోలు చేయదు.
* RBI పేరుతో ఫీజులు అడిగితే అది 100% మోసంగా భావించాలి.
* RBI ఎప్పుడూ ఆన్లైన్లో పాత నాణేలు అమ్మే ప్రక్రియలో పాల్గొనదు.
* IndiaMart, OLX వంటి వెబ్సైట్లు కేవలం మధ్యవర్తులుగా మాత్రమే ఉంటాయి, కానీ ఏ లావాదేవీకి బాధ్యత వహించవు కాబట్టి అందులో క్రయవిక్రయాలు జరిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి.
* ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తే కచ్చితంగా అందులో మోసం ఉందని అర్థం చేసుకోవాలి.
* ఎప్పుడూ ఫీజులు, చార్జీలు చెల్లించవద్దు.
* అధికారిక RBI వెబ్సైట్ లేదా ప్రభుత్వ సైట్లలో మాత్రమే సమాచారం చూడండి.
* వాట్సాప్ ద్వారా తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయవద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే వారిని కచ్చితంగా భౌతికంగా కలిసిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకోవాలి.
* మీరు మోసానికి గురయ్యారని అర్థమైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదా సైబర్ క్రైమ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.