దసరా పండుగ వేళ శ్రీముఖిని పెళ్ళాడుతున్న ప్రదీప్...శుభలేఖలు కూడా పంచేశారు..!

First Published Oct 21, 2020, 7:30 PM IST


దసరా పండుగ అంటేనే సంతోషం - చుట్టాలు, స్వీట్లు, నవ్వులతో ఇల్లు మొత్తం ఒక స్వర్గం లాగా మారిపోతుంది. కానీ ప్రస్తుత సమయంలో ఒకరినినొకరు పలకరించుకోవడానికే బయపడి పోతున్నారు. అందుకే అందరి ఇంటిలో సంతోషాలని వెదచల్లడానికి, మళ్లీ మనకు దసరాని కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి 'దసరా పండుగ అంట' అనే పాటను, స రి గ మ ప సీజన్ 13 యొక్క కంటెస్టెంట్లతో కలిసి ఒక పాట విడుదల చేయబోతుంది. అలాగే, అంతులేని వినోదం, నవ్వులు, డ్రామా, నాన్‌స్టాప్‌ గా ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు సిద్ధంగా ఉంది.

ఈ దసరా మహోత్సవాన్ని ‘చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది' కార్యక్రమంతో మరింత అందంగా, ఆనందంగా మార్చబోతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 25 సాయంత్రం 5 గంటలకు జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానళ్ళలో ప్రసారం కాబోతుంది.
undefined
అద్భుతమైన సెట్స్‌, బుల్లితెర స్టార్స్‌ యొక్క ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ లతో ‘చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది' కార్యక్రమం సూపర్బ్‌ కలర్‌ఫుల్‌ ఈవెంట్‌గా మారింది. ఈ కార్యక్రమానికి హైలెట్‌ నవ్వుల షెహన్షా నాగబాబు, ఆయన గారాల పట్టి నిహారిక కొణిదెల.
undefined
ఈ కార్యక్రమాన్ని టెలివిజన్ రాములమ్మ శ్రీముఖి, అందరి ఇంటి ముద్దు బిడ్డ ప్రదీప్ మాచిరాజు ముందు ఉండి నడిపించి కన్నులపండుగగా మార్చేశారు. అనసూయ భరద్వాజ్, జానీ మాస్టర్, పండు మాస్టర్, చంద్ర, వేణు, ధన్ రాజ్, గల్లి బాయ్స్ తో పాటు ఇంకా చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాలుపంచుకున్నారు.
undefined
దసరా పండుగు నాడు ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను సూపర్ వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తుంది. టాప్ యాంకర్స్ తో పాటు బుల్లితెరకమెడియన్స్ ఈ షోలో పాల్గొంటుండగా సూపర్ మజా ప్రేక్షకులకు సిద్ధం చేసినట్లు అర్థం అవుతుంది.
undefined
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్ మరియు శ్రీముఖి రొమాన్స్ హైలెట్ కానుంది. తాను ప్రదీప్ రాసిన ప్రేమ లేఖను చదువుతూ ఆమె పోయిన హోయలు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయి.
undefined
click me!