ఇక ప్రాంజల్ ప్రియా నుండి రియా సింఘాకి గట్టి పోటీ ఎదురైంది. ప్రాంజల్ పియా మొదటి రన్నరప్గా నిలిచింది. చావి వెర్గ్ రెండవ రన్నరప్గా నిలిచారు. సుష్మితా రాయ్, రూప్ఫుజానో విసో వరుసగా మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ ప్రత్యేకతను చాటుకున్నారు.
రియా విజయం సాధించిన నేపథ్యంలో అభిమానుల, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2015 విజేత, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ పోటీలో భారత్ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.