శ్రీవల్లి పాత్రకి మొదట సమంతని అనుకున్నాడట సుకుమార్. ఆమెని అప్రోచ్ అయినట్టు సమాచారం. కానీ సామ్ ఆసక్తి చూపించలేదు. దీంతో రష్మిక మందన్నా వద్దకు వెళ్లింది. ఇంకోవైపు మొదట షేకావత్ పాత్రకి విజయ్ సేతుపతిని అనుకున్నాడట సుకుమార్. అది కూడా సెట్ కాలేదు. దీంతో ఫహద్ ఫాజిల్ని దించాడట. ఐటెమ్ సాంగ్ కోసం నోరా ఫతేహి ని అనుకున్నారట. ఆమె చేయకపోవడంతో సమంతని తీసుకున్నారని తెలుస్తుంది. మహేష్, సమంత, విజయ్ సేతుపతి చేయాల్సిన ఈ మూవీ బన్నీ, రష్మిక, ఫహద్లు చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టారు. వీళ్లు తప్ప మరెవ్వరు సెట్ కారు అనేలా చేసి తామేంటో నిరూపించుకున్నారు. ఒకవేళ ఫస్ట్ అనుకున్న కాస్టింగ్తో సినిమా చేస్తే ఈ రేంజ్ రీచ్, హైప్ ఉండేదా అనేది డౌట్.