ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'ధర్మ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఉన్నారు. 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ హేమంత్ ఎం. రావు, యశ్ కలిసి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. నర్తన్ పవర్ఫుల్ డైరెక్షన్, యశ్ మ్యానరిజం కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.