వీళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే జమునని నాలుగేళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ బ్యాన్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తనని బ్యాన్ చేశారని జమున ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అదే వాళ్ళ నిర్ణయం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా సినిమాలు నేను చేసుకుంటాను.. అంటూ హరినాథ్ లాంటి హీరోలతో నటించేవారు.
అయితే గుండమ్మ కథ చిత్రంలో ఒక హీరోయిన్ గా సావిత్రి ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటున్న తరుణంలో నిర్మాతలు బి.యన్.రెడ్డి, చక్రపాణి లకు జమున అయితే కరెక్ట్ అని అనిపించింది. ఆ పాత్రలో జమున తప్ప ఇంకెవరు నటించలేరని వాళ్ళు అనుకున్నారు. దీంతో ఎన్టీఆర్, ఏఎన్నార్.. జమునకి మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని నిర్మాతలు అనుకున్నారు.