సావిత్రి వ్యాంప్‌ రోల్ చేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి మహానటి జీవితమే మారిపోయింది

Published : Jul 12, 2025, 08:09 AM ISTUpdated : Jul 12, 2025, 09:57 AM IST

మహానటి సావిత్రి నటిగా సంచలనాలు సృష్టించింది. అయితే కెరీర్‌ ప్రారంభంలో ఆమె వ్యాంప్‌ రోల్స్ చేసింది. ఐటెమ్స్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంది. ఆ సినిమాలేంటో చూద్దాం. 

PREV
15
మహానటి సావిత్రి తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం

మహానటి సావిత్రి తెలుగు సినిమాకి దక్కిన ఆణిముత్యం అని చెప్పాలి. హీరోల డామినేషన్‌ ఉండే సినిమాల్లో హీరోలను మించిన స్టార్‌డమ్‌తో రాణించింది. ఓ వెలుగు వెలిగింది.

తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ని అలరించింది. ముఖ్యంగా తెలుగుతోపాటు తమిళ ఆడియెన్స్ ని ఆమె ఆద్యంతం ఆకట్టుకుంది. ఇప్పటికీ తన సినిమాలతో అలరిస్తూనే ఉంది.

అయితే కెరీర్‌ బిగినింగ్‌లో సావిత్రి విభిన్నమైన పాత్రలు పోషించింది. తనకు స్టార్‌డమ్‌ రావడానికి ముందు చాలా ప్రయోగాత్మక పాత్రలు పోషించింది. వచ్చిన ఆఫర్‌ని కాదనకుండా చేసింది.

25
కెరీర్‌ బిగినింగ్‌లో ఐటెమ్ సాంగ్స్, వ్యాంప్‌ రోల్స్ చేసిన సావిత్రి

సావిత్రి కెరీర్‌ ప్రారంభంలో వ్యాంప్‌ రోల్స్, ఐటెమ్‌ సాంగ్స్ కూడా చేయడం విశేషం. సావిత్రి `సంసారం` చిత్రంతోనే నటిగా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ  చిన్న పిల్లలాగా ఉందని రిజెక్ట్ చేశారు. 

ఆ తర్వాత `పాతాళభైరవి` చిత్రంతో నటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఇందులో ఒక మాయామహల్‌లో డాన్స్ చేసే పాత్రలో కనిపించింది. చిన్నపాటి డాన్స్ సన్నివేశంలో సావిత్రి మెరిసింది. 

`రమ్మంటే రానే రాను...నేను రమ్మంటే రానేరాను` అనే పాటకు తనదైన అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకుంది. అలా వాహినీ స్టూడియోలోకి ఆమె అడుగుపెట్టింది.

35
`పెళ్లి చేసి చూడు`లో స్పెషల్‌ సాంగ్‌

`పాతాళభైరవి` బాక్సాఫీస్‌ హిట్‌ కావడంతో విజయా వారు మూడవ ప్రయత్నంగా ‘పెళ్ళి చేసి చూడు’ (1952) అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. 

సావిత్రిలో ఉన్న టాలెంట్‌ని గుర్తించిన నిర్మాత చక్రపాణి ఇందులో రెండవ హీరోయిన్‌గా నటించే అవకాశం కల్పించారు. 

ఆ సినిమాలో సావిత్రికి జోడు హాస్య నటుడు జోగారావు నటించారు. అందులో ఊర్వశి, అర్జునుడు, బాలమన్మధుడులతో ఒక అంతర్నాటకం ఉంది. 

ఆ నాటకంలో `యుగయుగాలుగా జగజగాలను వూగించిన.. వూగించిన మీ ఊర్వశిని` అనే పాటలో సావిత్రి ఊర్వశిగా నృత్యం చేసి మెప్పించింది. ఇలా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

45
`చంద్రహారం`లో వ్యాంప్‌ రోల్‌లో కనిపించిన సావిత్రి

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘శాంతి’ (1952) సినిమాతో ఫుల్‌ టైమ్‌ హీరోయిన్‌ అయిపోయింది సావిత్రి. ఇందులో రామచంద్ర కశ్యప సరసన  నటించింది. 

దోనేపూడి కృష్ణమూర్తి.. త్రిపురనేని గోపీచంద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘ప్రియురాలు’ (1952) చిత్రంలో రెండవ హీరోయిన్‌ సరోజగా చంద్రశేఖర్‌ సరసన నటించింది. 

ఇక విజయా వారు నిర్మించిన ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రం తరవాత నిర్మించిన ‘చంద్రహారం’ (1954) చిత్రంలో సావిత్రి వ్యాంప్‌ రోల్‌ చేయడం విశేషం. ఇందులో హీరోను వరించి తీసుకొని వెళ్ళే వ్యాంప్‌ లక్షణాలుగల దేవకన్య వేషం వేసింది మహానటి. 

ఈ సినిమా బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత సావిత్రి దశ తిరిగిపోయింది. పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆ మరుసటి ఏడాదే `మిస్సమ్మ`లో నటించే అవకాశం అందుకుంది.

 ఆ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత సావిత్రి మహానటిగా సృష్టించిన సంచలనాలు ఎలాంటివో అందరికి తెలిసిందే.

55
సావిత్రి కెరీర్‌ని దెబ్బకొట్టినవి ఇవే

మహానటి సావిత్రి హీరోలకు మించిన స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంది. అత్యధిక పారితోషికం అందుకుంది. కెరీర్‌ పరంగా పీక్‌ని చూసింది. కానీ ఆ తర్వాత తన భర్త జెమినీ గణేషన్‌ కారణంగా మద్యానికి బానిసయ్యింది.

సినిమాలు నిర్మాణం చేసి చాలా లాస్‌ అయ్యింది. దర్శకురాలిగా ఫెయిల్‌ అయ్యింది. ఇవన్నీ ఆమెని చుట్టుముట్టాయి. మానసికంగా కుంగిపోయింది. కోమాలోకి వెళ్లి కన్నుమూసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories