ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రచ్చరచ్చ అయ్యింది. ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ చేసిన సీజన్ నానా గొడవలతో బిగ్ బాస్ కాస్తా.. బిగ్గర్ బాస్ అయ్యింది. మరీ ముఖ్యంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శోభ తో పాటు మరికొంత మంది కంటెస్టెంట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక అమర్ దీప్ అయితే హౌస్ లో పాలిటిక్స్ తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా చేశాడు. పల్లవి ప్రశాంత్ చేయి కూడా కొరికాడు. ఈక్రమంలో విన్నర్ పై ఉత్కంట ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ కప్పుగెలిచాడు.
అయితే అమర్ దీప్ పైన నెగెటివిటి ఉండగా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా బిగ్ బాస్ పరువు పోయేలా చేసి.. ఇంకా నెగిటివిటీమూటకట్టుకున్నాడు. అంతే కాదు పల్లవిప్రశాంత్ విన్నర్ గా బయటకు వచ్చిన తరువాత అమర్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై ప్రశాంత్ అభిమానులు దాడి చేయడంతో పాటు బస్సులు ద్వాంసం చేయడం కూడా పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది.
ఇక ప్రశాంత్ ఎపిసోడ్ నడుస్తుండగానే.. అమర్ దీప్ రన్నర్ గా వెళ్ళిపోవిడం.. వివాదం తర్వాత అమర్ హైదరాబాద్ లో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు దీంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి తన సోంత పట్టణం అయిన అనంతపురం వెళ్లిపోయారు.
అయితే అక్కడ అభిమానులతో, ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజులపాటు ఉన్నటువంటి అమర్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈయన హైదరాబాద్ వచ్చినప్పటికీ ఎవరికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి అందుబాటులో లేరని తెలుస్తుంది. అమర్ ను ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని చాలా మంది యూట్యూబర్స్.. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అమర్ ఇంటికి వెళ్తున్నారట. కాని అతను మాత్రం అందుబాటులో లేడని తెలుస్తోంది.
ఇలా హైదరాబాద్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా అందుబాటులో ఉండకుండా అమర్ దీప్ ఎక్కడికి వెళ్ళాడని అంతా ఆశ్చర్చంగా ఎదరు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ లో బాగా స్ట్రగుల్ అయ్యాడు అమర్. ఒత్తిడి తట్టుకోలేక అరుపులు కేకలు పెట్టాడు. ఒత్తిడికి గురైనటువంటి అమర్ తన భార్య తేజుతో కలిసి కొంత సమయం పాటు ప్రశాంతంగా గడపడం కోసం వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది.
కొన్ని రోజులపాటు అమర్ దీప్ ఎవరికి కనిపించడంటున్నారు. ఈవిషయాన్ని అమర్ స్నేహితులు కన్ ఫార్మ్ చేసినట్టు సమాచారం. అంతే కాదు అమర్ బాగా ఇబ్బంది పడ్డాడు..అందకే అతనికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం కనుక ఆయన తన భార్యతో కలిసి వెకేషన్ వెళ్లారని తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తారంటూచెపుతున్నారు.