ఆ డైరెక్టర్ ని పదే పదే వేడుకున్న సాయి పల్లవి.. షూటింగ్ అయ్యే వరకు ఒకటే టెన్షన్!

First Published May 9, 2024, 5:01 PM IST

సాయి పల్లవి అరుదైన హీరోయిన్స్ లో ఒకరు. సిద్ధాంతాలు పెట్టుకుని నటించే ఏకైక హీరోయిన్. అలాంటి సాయి పల్లవి ఓ దర్శకుడుని పదే పదే బ్రతిమిలాడుకుందట. ఆ కథ ఏమిటో చూద్దాం... 
 

తమిళనాడులో పుట్టిన సాయి పల్లవికి తెలుగులోనే ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆమెను టాలీవుడ్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సాయి పల్లవి అంటే ఆడియన్స్ లో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆమె చేసిన పాత్రలు ఆ గౌరవాన్ని తెచ్చాయి. సాయి పల్లవి గ్లామరస్ రోల్స్ చేయదు. 

హీరో ఎవరైనా కథలో తనకు ప్రాధాన్యత ఉండాల్సిందే. రెమ్యూనరేషన్ కంటే కూడా కథకు పాధాన్యత ఇస్తుంది. భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ పాత్రకు సాయి పల్లవిని సంప్రదించగా రిజెక్ట్ చేసింది. తాను హీరోయిన్ గా నటించిన చిత్రాలు డిజాస్టర్ అయిన సందర్భంలో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం. 

అయితే ఓ దర్శకుడిని మాత్రం ఆమె బ్రతిమిలాడుకున్నారట. ఈ విషయాన్ని సాయి పల్లవి స్వయంగా చెప్పింది. ఓ రెండు చిత్రాల్లో ప్రధాన్యత లేని పాత్రలు చేసిన సాయి పల్లవికి ప్రేమమ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు అల్పోన్సే పుతేరన్. 

ఆడిషన్స్ ద్వారా సాయి పల్లవికి ప్రేమమ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అయితే సాయి పల్లవికి మాత్రం నమ్మకం ఉండేది కాదట. తన పట్ల తనకే తక్కువ భావన ఉండేదట. నేను పెద్దగా అందంగా ఉండను. ముఖాన మొటిమలు... నిజంగా నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారా? అని మండిపడుతూ ఉండేదట. 

ఈ క్రమంలో మాటిమాటికి దర్శకుడు అల్పోన్సే వద్దకు వెళ్లి బ్రతిమిలాడేదట. మీరు నన్ను ఈ సినిమా నుండి తీసేయరు కదా? అని ఆందోళన చెందేదట. అలాంటిదేమీ లేదు. ఈ సినిమాకు నువ్వే హీరోయిన్ అని అల్పోన్సే చెప్పేవాడట. షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా పలుమార్లు సాయి పల్లవి దర్శకుడి వద్ద ఇదే సందేహం వ్యక్త పరిచిందట. 
 

నిజానికి ప్రేమమ్ లో సాయి పల్లవికి ఆ ఆఫర్ ముఖాన మొటిమలు ఉండటం వలనే వచ్చిందట. ఆయన రాసుకున్న పాత్రకు సింపుల్ గా ఉండే నాచురల్ బ్యూటీ కావాలని ఆయన అనుకున్నారు. దాంతో ప్రేమమ్ లో హీరోయిన్ రోల్ ఆమెకు దక్కింది. ప్రేమమ్ మలయాళంలో భారీ హిట్ కొట్టింది. 

ఇక ఫిదా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్స్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామయానాం మూవీలో సీత పాత్ర చేస్తుంది. 

తెలుగులో నాగ చైతన్యకు జంటగా తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. డిసెంబర్ లో తండేల్ విడుదల కానుంది.  రన్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. నేడు సాయి పల్లవి పుట్టినరోజు కాగా ఆమె 32వ ఏట అడుగు పెట్టింది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

click me!