Nagma
90లలో నగ్మా స్టార్ గా వెలిగింది. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న నగ్మా ఇండియా వైడ్ టాప్ హీరోలతో జతకట్టింది. చిరంజీవి-నగ్మా కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఘరానా మొగుడు. ఇది సూపర్ హిట్. అనంతరం ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో జతకట్టారు.
Chiraneevi
1995లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన రిక్షావోడు చిత్రంలో మరోసారి నగ్మా, చిరంజీవి జతకట్టారు. ఈ చిత్రంలో నగ్మా గొప్పింటి అమ్మాయి పాత్ర చేయగా... చిరంజీవి రిక్షా కార్మికుడు పాత్ర చేశాడు. రామానాయుడు స్టూడియోలో 'పాప ఎదిరింప' అనే సాంగ్ షూట్ చేస్తున్నారట.
Nagma
షాట్ గ్యాప్ లో చిరంజీవి-నగ్మా మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందట. నగ్మా అలిగి కోపంగా మేకప్ రూమ్ నుండి వెళ్లిపోతుంటే... చిరంజీవి బ్రతిమిలాడుతూ ఆమె వెనకాల పడ్డాడట. నగ్మా... ఆగు, నా మాట విను అంటున్నారట. ఏం జరుగుతుందని సెట్ లో ఉన్నవారంతా వాళ్లనే చూస్తున్నారట.
Nagma
ఆ రోజు షూటింగ్ అయితే జరిగిందట. రెండో రోజు కూడా అదే సాంగ్ మిగిలిన పార్ట్ షూట్ చేశారట. చిరంజీవి ఎప్పటిలాగానే అందరితో మాట్లాడుతూ నార్మల్ గా కనిపించారట. నగ్మా మాత్రం ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయిందట. అసలు నగ్మా-చిరంజీవి కి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ తెలియదట.
Chiranjeevi
రిక్షావోడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ తర్వాత నగ్మాతో చిరంజీవి మరో మూవీ చేయలేదు. దాన్ని బట్టి చూస్తే పెద్ద గొడవే జరిగింది. అది మేకప్ రూమ్ లో జరిగిన నేపథ్యంలో సెట్స్ లో ఉన్నవారెవరికీ స్పష్టంగా తెలియదు. ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయనేది మాత్రం నిజం...