అనంతరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... తెలుగు సినిమాను ఏలారు. మిడ్ ఎయిటీస్ లో వీరి ప్రభావం మొదలైంది. నైంటీస్ ఆరంభానికి స్టార్డం తెచ్చుకున్నారు. మిగతా ముగ్గురితో పోల్చితే చిరంజీవి కొంచెం ముందే స్టార్ హోదా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే సోలోగా సత్తా చాటుతున్నారు. నాగార్జున, వెంకటేష్ చిత్రాలు సోలోగా ఆడటం లేదు. అందుకే మల్టీస్టారర్స్ ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ అతిపెద్ద హీరోలుగా వెలుగులోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఆయన సినిమాల మీద దృష్టి తగ్గించారు. గతంలో మాదిరి క్వాలిటీ చిత్రాలు ఆయన నుండి రావడం లేదు. ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ చిత్రాల పట్ల ఆసక్తిపోయింది. అభిమానులు మాత్రమే ఆదరిస్తున్నారు.