పవన్ తో రేణూ పిల్లలు... మళ్ళీ ఇద్దరు ఒక్కటయ్యారా?

First Published Dec 2, 2020, 1:42 PM IST

దాదాపు 10ఏళ్ళు పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కలిసి కాపురం చేశారు. బద్రి సినిమాతో మొదలైన వీరి బంధం 2011 వరకు కొనసాగింది. 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. పిల్లలు అకీరా, ఆద్య తల్లి దగ్గరే పెరుగుతున్నారు. 
 

పవన్ తో విడిపోయాక తాను పడిన మానసిక వేదన, ఆర్థిక ఒడిదుడుకుల గురించి రేణూ బహిరంగానే మాట్లాడారు. తన స్వశక్తితో ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశానని, పవన్ నుండి ఆర్థికంగా తనకు ఎటువంటి మద్దతు లభించలేదని అన్నారు.
undefined
పరోక్షంగా పవన్ ని పెళ్లి చేసుకోవడం వలన పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా నష్టపోయానని రేణూ దేశాయ్ అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఈ విషయంలో రేణూపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా దాడికి దిగారు. రేణూ రెండో పెళ్లిని కూడా పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.
undefined
ఏది ఏమైనా ఓ స్నేహితుడితో రేణూ దేశాయ్ కి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం ఉంది. పవన్ పై రేణూ దేశాయ్ అభిప్రాయం మారుతూ ఉంటుంది. వీలుదొరికినప్పుడల్లా విమర్శించే రేణూ, అప్పుడప్పుడు పవన్ తో గతంలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేస్తారు.
undefined
తాజాగా అకీరా, ఆద్య పవన్ ఒడిలో సేద తీరుతున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోను అందమైన, మరపురాని క్షణంగా ఆమె అభివర్ణించారు. ఎవరైనా అకీరా, ఆద్యలు పవన్ పిల్లలు అంటేనే మండి పడే రేణూ, పవన్ తో వాళ్లిద్దరూ ఉన్న ఫోటోని షేర్ చేయడం ఆసక్తికరం అని చెప్పాలి.
undefined
అసలు రేణూ కి పవన్ పై ఉన్న అభిప్రాయం ఏమిటనే అనుమానం రాక మానదు. రేణూ మాజీ భర్త పవన్ ని ద్వేషిస్తుందో లేక ప్రేమిస్తుందో అర్థం కావడం లేదు. రేణూ పిల్లలు సందర్భాను సారం మెగా ఫ్యామిలీతో కలుస్తారని అందరికీ తెలుసు. రేణూ కూడా చట్టరీత్యా విడిపోయినా ఆ కుటుంబం మరియు పవన్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానం కలుగుతుంది.
undefined
ఇక కెరీర్ పరంగా రేణు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆద్య అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణూ దేశాయ్, దర్శకత్వం కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి.
undefined
click me!